Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై వలలోపడి మోసపోయిన మహిళా న్యాయవాది!

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (12:12 IST)
సోషల్ మీడియా మాయలో పడి సామాన్య పౌరులే కాదు.. విద్యావంతులు కూడా మోసపోతున్నారు. తాజాగా ఓ మహిళా న్యాయవాది సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఎన్నారైను నమ్మి మోసపోయింది. అప్పటికే వివాహమై పిల్లలున్న ఆ ఎన్నారై.. మహిళా న్యాయవాదిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా అతని బండారం బయటపడటంతో ఆమె ముఖం చాటేసింది. దీంతో తనలోని మరో కోణాన్ని ఎన్నారై బయటపెట్టాడు. అప్పటికిగానీ తాను మోసపోయాననే విషయాన్ని ఆ మహిళా న్యాయవాది గ్రహించలేకపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉండే అమేజ్ లోఖండ్‌వాలా అనే ఎన్నారైతో ఢిల్లీ దర్వాజాలోని సలాత్వాద్‌కు చెందిన 29 ఏళ్ల మహిళా న్యాయవాదికి గతేడాది ఏప్రిల్‌లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ చాటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఒకరోజు తనకు 34 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లు న్యాయవాదితో లోఖండ్‌వాలా చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆమెను నమ్మించేందుకు ఏకంగా ఓ నకిలీ బర్త్ సర్టిఫికేట్ కూడా పంపించాడు. అది చూసిన ఆమె నిజం అని నమ్మేసింది. ఆ తర్వాత లోఖండ్‌వాలాను పెళ్లి చేసుకునేందుకు సమ్మతించింది. దాంతో ఆమె ఫొటోలు అడిగి తీసుకున్నాడు. అలాగే తన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది. 
 
ఈ క్రమంలో ఒకరోజు లాయర్‌కు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. లోఖండ్‌వాలాకు వివాహమైందని, అతని వయస్సు 48 ఏళ్లని, 17 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు ఆమె చెప్పింది. అది విన్న న్యాయవాదికి మైండ్‌బ్లాంక్ అయింది. వెంటనే ఈ విషయమై లోఖండ్‌వాలాను నిలదీసింది. దాంతో తనకు అసలు పెళ్లి కాలేదని, నీకు ఫోన్ చేసిన మహిళ నా అన్నయ్య భార్య అని, వారిద్దరికి సంబంధించిన ఓ పెళ్లి ఫొటోను కూడా లోఖండ్‌వాలా ఆమెకు పంపించాడు. 
 
ఇదిలాఉండగా.. కొన్ని రోజుల తర్వాత ఇంతకుముందు లాయర్‌కు ఫోన్ చేసిన మహిళ ఈసారి వాట్సాప్ వీడియో కాల్ చేసింది. అందులో లోఖండ్‌వాలా పక్కన ఓ మహిళ ఉండడం కనిపించింది. అందులో కనిపిస్తున్న మహిళనే అతని భార్య అని వీడియో కాల్ చేసిన మహిళ చెప్పింది. 
 
దాంతో అప్పటి నుంచి తనను మోసం చేసిన లోఖండ్‌వాలాతో ఆమె మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో అతగాడు తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి అంతర్జాలంలో పెట్టాడు. పైగా ఆమెను వ్యభిచారిగా పేర్కొన్నాడు. నెట్టింట ఆ ఫొటోలు చూసిన బాధితురాలు కరంజ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తుజరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments