Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (11:28 IST)
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ఇప్పటివరకు 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా గుర్తించామని, 47 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అధికారులు సోమవారం తెలిపారు.
 
జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం తర్వాత చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో బాధితుల గుర్తింపును నిర్ధారించడానికి అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
మృతులు గుజరాత్‌లోని భరూచ్, ఆనంద్, జునాగఢ్, భావ్‌నగర్, వడోదర, ఖేడా, మెహ్సానా, అర్వల్లి, అహ్మదాబాద్ జిల్లాల వంటి వివిధ ప్రాంతాలకు చెందినవారని అదనపు సివిల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ విలేకరులకు తెలిపారు.
 
 జూన్ 12న మధ్యాహ్నం 1.39 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే 242 మందితో కూడిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్‌లోని ఒక వైద్య కళాశాల సముదాయంలో కూలిపోయింది.
 
 
 
లండన్ వెళ్తున్న విమానంలో 241 మంది మరణించగా, ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా, ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా ఈ విపత్తులో 29 మంది మరణించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments