మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన కొత్త జంట తప్పిపోయిన ఘటనలో భర్త రఘువంశీ హత్య చేయబడ్డాడు. అతడి భార్య ఆచూకి మాత్రం ఇప్పటివరకూ లభించలేదు. దీనిపై ఆమె సోదరుడు పోలీసులకు ఆమెను తెలిసినవారే కిడ్నాప్ చేసి వుంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇండోర్కు చెందిన సోనమ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటివరకూ ఆమె ఆచూకి లభించలేదు. ఆమె భర్త రాజా రఘువంశీ మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక లోయలో హత్యకు గురైనట్లు గుర్తించారు.
తప్పిపోయిన మహిళ సోదరుడు గోవింద్ రఘువంశీ మాట్లాడుతూ, తన సోదరి బతికే ఉందని తాము నమ్ముతున్నామని, మరోలా ఆలోచించడానికి ఎటువంటి కారణం లేదని అన్నారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించాలని కూడా కుటుంబం కోరింది.
మే 22న ఇండోర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణించిన ఈ జంట, సుందరమైన చిరపుంజి, ఒసారా హిల్స్ సమీపంలో ఒక రోజు తర్వాత అదృశ్యమయ్యారు. కనిపించకుండా పోయిన 11 రోజుల తర్వాత, రాజా మృతదేహం లోతైన లోయలో కనుగొనబడింది. అతని చేతిపైన వున్న పచ్చబొట్టు ద్వారా అతని గుర్తింపు నిర్ధారించబడింది. సోనమ్ జాడ తెలియకపోవడంతో అనుమానం పెరిగింది. ఆ కుటుంబం ఈ దారుణాన్ని తీవ్రంగా అనుమానిస్తోంది,
హత్యకు గురైన రాజా మొబైల్ ఫోన్తో పాటు సమీపంలో పడి వున్న ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అన్నారు. ఇది స్పష్టంగా హత్య కేసనీ, దానిపై ఎటువంటి సందేహం లేదన్నారు. దర్యాప్తుకు నాయకత్వం వహించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడింది. అయితే ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాజా సోదరుడు విపిన్ రఘువంశీ కుటుంబం డిమాండ్ చేస్తోంది.