గత ఐదు నెలలుగా 15 ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు తరచూ అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ ఐదుగురు కామాంధుల్లో ఇద్దరు మైనర్లు వున్నారు. కర్నాటకలోని బెళగావి పోలీసు కమీషనర్ వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. 15 ఏళ్ల బాలిక స్నేహితుడైన ఓ యువకుడు ఆమెను గత జనవరి నెలలో సమీపంలోని తోట ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను లొంగదీసుకుని అత్యాచారం చేసాడు. ఈ సమయంలో జరిగినదంతా వీడియో తీసాడు.
అంతటితో ఆగకుండా ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేసాడు. వాళ్లలో నలుగురు ఆ వీడియోలను బాధితురాలికి చూపిస్తూ... తమ కోర్కె తీర్చకపోతే వీడియోలు బైటపెడతామంటూ బెదిరించారు. దీనితో బాధిత బాలిక భయపడిపోయి వారు చెప్పినట్లే చేసింది. అలా మొత్తం ఐదుగురు కామాంధులు ఎప్పుడుబడితే అప్పుడు బాధిత బాలికకు ఫోన్ చేసి రప్పించుకుంటూ అత్యాచారం చేయడం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బైటకు చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని కూడా భయపెట్టారు. దానితో బాధితురాలు విషయాన్ని దాచిపెట్టింది.
ఐతే గత నాలుగు రోజులుగా బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో బాధిత బాలిక వద్ద ఆరా తీసారు. దాంతో తనపై ఐదుగురు కామాంధులు చేస్తున్న దారుణాన్ని వెల్లడించింది. కుమార్తె చెప్పిన విషయాలు విని షాక్ తిన్న ఆమె పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెపై జరుగుతున్న లైంగిక దాడి చేస్తున్న వ్యక్తుల వివరాలను కూడా ఇచ్చారు. మొత్తం ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురు మేజర్లు కాగా ఇద్దరు మైనర్లు వున్నారు. మేజర్లయిన నిందితులను రిమాండుకి తరలించి మైనర్లను జువనైల్ హోంకి తరలించారు.