Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి కొత్త ఎత్తు... శిక్ష తగ్గించాలంటూ గవర్నర్‌కు పిటిషన్

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (08:17 IST)
నిర్భయ కేసులోని దోషుల్లో వినయ్ గుప్తా అనే ముద్దాయి మరో కొత్త ఎత్తు వేశాడు. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆదేశాల మేరకు నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఈ నెల 20వ తేది ఉదయం ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. అయితే, ఈ శిక్షలను తప్పించుకునేందుకు ఈ నలుగురు ముద్దాయిలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇపుడు వీరికి దారులన్నీ మూసుకునిపోయాయి. 
 
ఈ క్రమంలో వినయ్ గుప్తా అనే దోషి సరికొత్త ఎత్తుగడ వేశాడు. తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాను అనుభవించిన జైలు శిక్ష తనలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిందని, తన కుటుంబ పరిస్థితిని కూడా చూడాలని గవర్నర్‌ను కోరాడు.​
 
మరి, ఇపుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... కోర్టు తాజాగా జారేసిన డెత్ వారెంట్ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నిర్భయ దోషులకు ఉరిశిక్షలను అమలుచేస్తారా? లేదా? అనే అంశంపై ఇపుడు సందిగ్ధత నెలకొంది.

సంబంధిత వార్తలు

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments