Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్త ప్రాణాలనే తీసిన భార్య

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:22 IST)
కామాంధురాలైన ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. అన్నవరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో సొంత భర్త ప్రాణాలను తీసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా బర్హన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖంద గ్రామానికి చెందిన మృతుడు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య రవీన, కుమారుడు ఉన్నాడు. వీరంతా కలిసి లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందుగానే ఇంటికి వచ్చారు. 
 
ఆ తర్వాత రవీన తమ ఇంటికి పక్కనే నివసించే ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయమేర్పడింది. ఈయన ఆమెకు అన్నవరుస అవుతాడు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన ఆమె... ప్రతాప్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత తమ బంధం చివరి వరకు కొనసాగాలన్న ఉద్దేశ్యంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీనికి ప్రతాప్ కూడా సాయం చేశాడు. 
 
దీంతో ఇటీవల ఓ రోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రవీన అత్యంత పాశవికంగా తన భర్త గొంతు కోసి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రవీనను అరెస్టు చేశారు. అయితే ప్రతాప్ మాత్రం పరారీలో ఉన్నాడు. దీనిపై బర్హన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments