Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నిండు గర్భిణి.. ఐసోలేషన్‌లో చికిత్స

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నిండు గర్భిణి.. ఐసోలేషన్‌లో చికిత్స
, శనివారం, 4 ఏప్రియల్ 2020 (13:35 IST)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్‌తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ భార్య నిండు గర్భిణి. డాక్టర్‌తో పాటు ఆమెను ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు శుక్రవారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. మొత్తానికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఓ కరోనా పేషెంట్‌ బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇదే తొలిసారి. తల్లీ బిడ్డ వైద్యుల పర్యవేక్షణలో వున్నారు. సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, సర్దార్‌ వల్లభాయి హాస్పిటల్‌ డాక్టర్‌కు, ఢిల్లీ బస్తీ దవఖానాల్లో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాను కరోనా వైరస్ ఎలా కాటేస్తుందో చూడండి, ఆ దేశం చేసిన తప్పులేంటి? ఒప్పులేంటి?