Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు వినండి : సుప్రీంలో కేంద్రం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:56 IST)
భారత ఆర్మీలో సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ ఇపుడు సుప్రీంకోర్టుకు చెంతకు చేరింది. ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం పార్లమెంట్ ఆమోదం కూడా లేకుండానే నియామక ప్రక్రియను మార్చారంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హర్ష్ అజయ్ సింగ్ అనే న్యాయవాది దాఖలు చేశారు.
 
అగ్నిపథ్ అమలుపై మరోమారు పునరాలోచన చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అంతకుముందు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు లాయర్లు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టు ఏదేనీ ఆదేశాలు జారీచేసే ముందు తమ వాదనలు కూడా వినాలంటూ కేంద్ర ప్రభుత్వం తరపున ఒక పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్‌కు సంబధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నట్టయితే తమ వైపు నుంచి కూడా వాదనలను వినాలని కేంద్రం కోరింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments