Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (22:01 IST)
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రూపాయి క్షీణతతో పసిడి ధర అమాంతం పెరిగింది. ఆ ప్రభావం దేశీయ ధరలపైనా పడింది.

దీంతో బులియన్ మార్కెట్లో పుత్తడి ధర మళ్లీ 40వేల మార్క్ ను దాటింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 752 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 40,652 పలికింది. అటు వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. రూ. 960 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 48,870కి చేరింది.

ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సులేమానిని అమెరికా హత్య చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావించారు.

దీనికి తోడు రూపాయి విలువ పతనమవడం కూడా ఈ లోహాల ధరలు పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments