Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్‌ల మధ్య సరిహద్దు వివాదం... గంటలకొద్దీ రోడ్డుపైనే మృతదేహం!!

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (16:39 IST)
పోలీస్ స్టేషన్‌లో మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మృతదేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోయింది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు స్థానికులు జత కలిసి రోడ్డుపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో మధ్యప్రదేశ్ పోలీసులు దిగొచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన రాహుల్ అహిర్వార్ అనే యువకుడు ఢిల్లీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే వివాహం జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాత్రి 7 గంటలకు హర్పల్ పూర్ ఏరియాలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం రాహుల్‌ను ఢీ కొట్టింది. 
 
దీంతో తీవ్రగాయాలపాలైన రాహుల్.. అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో హర్పల్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబక్ నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
దీంతో స్థానికులు మహోబక్‌నాథ్ పోలీసులకు సమాచారం అందించగా.. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, హర్పల్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోకపోవడంతో రాహుల్ మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. గంటలు గడుస్తున్నా పోలీసులు స్పందించకపోవడం, రాహుల్ కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికులు మండిపడ్డారు. 
 
రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో చివరకు మహోబక్ నాథ్ పోలీసులు స్పందించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో రాహుల్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments