Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:38 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉనికిలో లేని మంత్రిత్వశాఖకు ఓ మంత్రి 20 నెలలుగా ఉన్నారు. దీన్ని సవరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన ఒక జోక్‌గా ఉందని పేర్కొంది. 
 
కాగా, గత 2022 మార్చి నెలలో పంజాబ్ రాష్ట్రంలో భగవంత్ మాన్ సింగ్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2023లో మే నెలలో కుల్దీప్ సింగ్ ధలివాల్‌కు రెండు శాఖలు కేటాయించారు. ఇందులో ఒకటి ప్రవాస భారతీయ వ్యవహరాల మంత్రిత్వ శాఖ కాగా రెండోది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్టుమెంట్. 2024 ఆఖరులో మరోమారు పనర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అయితే, దీనిని తాజాగా సవరించింది. కుల్దీప్‌కు కేటాయించిన కేటాయించిన శాఖను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. కాగా, లేని శాఖకు కుల్దీప్ సింగ్ మంత్రిగా ఉన్న వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. పంజాబ్‌లో పాలనకు ఆప్ పాలన ఒక జోక్‌గా మార్చివేసిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

కాలేజీ రోజుల్లో హిచ్ కాక్ సినిమాలు చూసేవాడిని : మెగాస్టార్ చిరంజీవి

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా కామెడీ థ్రిల్లర్ జిగేల్ సిద్దమవుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments