Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:38 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉనికిలో లేని మంత్రిత్వశాఖకు ఓ మంత్రి 20 నెలలుగా ఉన్నారు. దీన్ని సవరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన ఒక జోక్‌గా ఉందని పేర్కొంది. 
 
కాగా, గత 2022 మార్చి నెలలో పంజాబ్ రాష్ట్రంలో భగవంత్ మాన్ సింగ్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2023లో మే నెలలో కుల్దీప్ సింగ్ ధలివాల్‌కు రెండు శాఖలు కేటాయించారు. ఇందులో ఒకటి ప్రవాస భారతీయ వ్యవహరాల మంత్రిత్వ శాఖ కాగా రెండోది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్టుమెంట్. 2024 ఆఖరులో మరోమారు పనర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అయితే, దీనిని తాజాగా సవరించింది. కుల్దీప్‌కు కేటాయించిన కేటాయించిన శాఖను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. కాగా, లేని శాఖకు కుల్దీప్ సింగ్ మంత్రిగా ఉన్న వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. పంజాబ్‌లో పాలనకు ఆప్ పాలన ఒక జోక్‌గా మార్చివేసిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments