Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారికి 22 కేజీల బంగారు చీర.. ఎక్కడ?

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు.

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (12:31 IST)
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు. తాజాగా దసరా వేడుకలు వైభవోపేతంగా జరిగే పశ్చిమబెంగాల్‌లో అమ్మవారి విగ్రహానికి 22 కేజీల బంగారంతో చీరను తయారు చేశారు. 
 
సాధారణంగా దసరా వచ్చిందంటే పశ్చిమబెంగాల్‌లో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కోల్‌కతాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్‌ థీమ్‌తో మండపం ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారికి బంగారంతో తయారు చేసిన చీర అందరికీ ఆకట్టుకుంటోంది.
 
పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్‌ ఈ చీరను డిజైన్‌ చేశారు. దాదాపు 50 మంది నిపుణులు ఈ చీర తయారీలో పాలుపంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments