పిడుగును సెల్ ఫోనులో బంధించాలని చూశాడు... అదే అతడిని కబళించింది....

ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని చెపుతారు. హఠాత్తుగా పిడుగులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు దరిదాపుల్లో పక్కా భవనం ఏదీ లేనప్పుడు కనీసం పల్లంగా వున్న ప్రదేశాన్ని చూసుకుని బోర్లా పడుకుండిపోవాలని పెద్దలు చెపుతారు. ఎందుకంటే ఒక

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (14:33 IST)
ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని చెపుతారు. హఠాత్తుగా పిడుగులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు దరిదాపుల్లో పక్కా భవనం ఏదీ లేనప్పుడు కనీసం పల్లంగా వున్న ప్రదేశాన్ని చూసుకుని బోర్లా పడుకుండిపోవాలని పెద్దలు చెపుతారు. ఎందుకంటే ఒక చిన్న పిడుగుకి రోజుకి 500 ఇళ్లకు విద్యుచ్ఛక్తి సరఫరా చేసేంత శక్తి వుంటుందట. మరి అంతటి శక్తివంతమైన పిడుగు మనిషిని తాకితే ఇంకేముంటుంది? ఐతే ఇలాంటి పిడుగులను బంధించాలని కొంతమంది చూస్తుంటారు. 
 
అలాంటి ఘటనే తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగింది. పిడుగు పడటాన్ని తన మొబైల్ ఫోన్లో ఫొటో తీసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడతను. సున్నంబుకుళం గ్రామంలో తన స్నేహితుని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా పిడుగులతో కూడిన వర్షం పడుతోంది. దానితో అతడు మెరుపు తీగల్లా భూమిని తాకుతున్న పిడుగును తన మొబైల్ ఫోనులో బంధించాలని ప్రయత్నించాడు.

దురదృష్టవశాత్తూ ఆ పిడుగు నేరుగా అతడిపైనే పడింది. దాంతో అతడు ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. మృతుడు తురైప్పాకం గ్రామానికి చెందిన 45 ఏళ్ల హెచ్ ఎం రమేశ్‌గా గుర్తించారు పోలీసులు. కాగా ఇలా పిడుగులు పడేటప్పుడు ఎవరూ ఇలాంటి సాహసం చేయవద్దని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments