Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి ప్రేయసిని నమ్మించి రేప్... రెండేళ్ల తర్వాత తీర్పు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:20 IST)
ఫ్రెండ్ లవర్‌ను నమ్మించి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన తమిళనాడు కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. ఇందుకు సంబంధించిన విచారణ రెండేళ్ల పాటు సాగింది. నిందితుడికి కోర్టు 20 ఏళ్లపాటు జైలు శిక్షను ఖరారు చేసింది.
 
కడలూరులోని పెరియకోటమూలై ప్రాంతానికి చెందిన సత్యమూర్తి, విజయేంద్రన్ స్నేహితులు. అయితే విజయేంద్రన్ ప్రియురాలిపై సత్యమూర్తి ఎప్పటినుంచో కన్నేశాడు. అందుకు ఒక పథకాన్ని రచించాడు. 2017 మార్చి 17న సత్యమూర్తి యువతికి ఫోన్ చేసి విజయేంద్రన్‌కి యాక్సిడెంట్ అయిందని, కోయంబత్తూర్ హాస్పిటల్‌లో చేర్చినట్లు అలాగే అతడి కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పి ఆమెను బైక్‌పై తీసుకెళ్లాడు. అతని మాయమాటలు వినిన యువతి బైక్‌పై వెళ్లింది. 
 
నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లిన సత్యమూర్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుండి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అప్పట్లో స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ సంఘటనపై విచారణ జరిపిన కడలూరు విమెన్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడికి రెండేళ్ల తర్వాత శిక్షపడడంతో తగు న్యాయం జరిగిందంటూ పలువురు ఆనందం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments