Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (19:47 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖం పైన ఓ వ్యక్తి ద్రవం పోసాడు. శనివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి ద్రవం విసిరాడు. ఘటనా స్థలంలో ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి కేజ్రీవాల్ ఇరుకైన సందులో ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేతలకు ఇరువైపులా పోలీసులు తాడు బిగించి జనాన్ని అదుపు చేశారు.
 
కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా ఆప్ నిర్వహించిన పాదయాత్ర మాల్వీయా నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా జరిగిందని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు. ఐతే ప్రజల రద్దీని నియంత్రించేందుకు పోలీసులను మోహరింపజేసినప్పటికీ, ఖాన్‌పూర్ డిపోకు చెందిన బస్ మార్షల్ అశోక్ ఝా, కేజ్రీవాల్ అనుచరులకు అభివాదం చేస్తున్నప్పుడు అతనిపై ద్రవం పోసాడు. సమీపంలోని పోలీసులు ఝాను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకిలా చేసాడన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments