Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (19:47 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖం పైన ఓ వ్యక్తి ద్రవం పోసాడు. శనివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి ద్రవం విసిరాడు. ఘటనా స్థలంలో ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి కేజ్రీవాల్ ఇరుకైన సందులో ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేతలకు ఇరువైపులా పోలీసులు తాడు బిగించి జనాన్ని అదుపు చేశారు.
 
కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా ఆప్ నిర్వహించిన పాదయాత్ర మాల్వీయా నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా జరిగిందని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు. ఐతే ప్రజల రద్దీని నియంత్రించేందుకు పోలీసులను మోహరింపజేసినప్పటికీ, ఖాన్‌పూర్ డిపోకు చెందిన బస్ మార్షల్ అశోక్ ఝా, కేజ్రీవాల్ అనుచరులకు అభివాదం చేస్తున్నప్పుడు అతనిపై ద్రవం పోసాడు. సమీపంలోని పోలీసులు ఝాను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకిలా చేసాడన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments