Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (19:47 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖం పైన ఓ వ్యక్తి ద్రవం పోసాడు. శనివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి ద్రవం విసిరాడు. ఘటనా స్థలంలో ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి కేజ్రీవాల్ ఇరుకైన సందులో ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేతలకు ఇరువైపులా పోలీసులు తాడు బిగించి జనాన్ని అదుపు చేశారు.
 
కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా ఆప్ నిర్వహించిన పాదయాత్ర మాల్వీయా నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా జరిగిందని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు. ఐతే ప్రజల రద్దీని నియంత్రించేందుకు పోలీసులను మోహరింపజేసినప్పటికీ, ఖాన్‌పూర్ డిపోకు చెందిన బస్ మార్షల్ అశోక్ ఝా, కేజ్రీవాల్ అనుచరులకు అభివాదం చేస్తున్నప్పుడు అతనిపై ద్రవం పోసాడు. సమీపంలోని పోలీసులు ఝాను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకిలా చేసాడన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

Fedaration: ఫెడరేషన్ నాయకుల కుట్రతోనే సినీ కార్మికులకు కష్టాలు - స్పెషన్ స్టోరీ

ఆది శేషగిరి రావు క్లాప్ తో వేణు దోనేపూడి నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments