Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మంది చిన్నారులను నిర్భంధించాడు.. పోలీసులు కాల్చి చంపేశారు..

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (13:06 IST)
ఓ హత్యకేసులో నిందితుడిగా వున్న ఓ నిందితుడు చేసిన పని.. యూపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పుట్టినరోజు వేడుక అంటూ ఆహ్వానించి ఇంట్లో 20 మంది చిన్నారులను నిర్భంధించాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ హత్య కేసులో నిందితుడిగా వున్న సుభాష్ బాథమ్ అనే వ్యక్తి.. తన కుమార్తె పుట్టిన రోజుల వేడుకల కోసం ఇరుగుపొరుగున వున్న చిన్నారులను ఆహ్వానించాడు. అలా ఇంటికొచ్చిన 20మంది పిల్లల్ని ఓ ఇంట్లో బంధించాడు. ఇంకా ఆ ఇంట్లో కాల్పుల శబ్ధం రావడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. అతడితో చర్చకు ప్రయత్నించిన వారిపై కూడా సుభాష్ కాల్పులు జరిపాడు.
 
ఇంకా పోలీసుల పైకి గ్రెనెడ్ విసరడంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. ఈ ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని ఫరూఖాబాద్, కసారియా గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. బందీలెవరికి ఎలాంటి హాని కలగకుండా తక్షణం విడిపించే ప్రయత్నం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 
బందీల్లో ఎక్కువమంది ఐదేళ్ల నుంచి ఏడేళ్ల లోపు వున్నవారేనని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఆపరేషన్‌లో పోలీసులు సక్సెస్ అయ్యారు. సుభాష్ బాథమ్‌ను గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు కాల్చి చంపేశారు. పిల్లలను ఇంటి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారులను నిర్భంధించిన నిందితుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments