Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు

యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (19:14 IST)
యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం తల్లి తన కుమారునికి బిస్కెట్ కొనుక్కోవడానికి 2 రూపాయలు ఇవ్వలేదని కోపగించుకున్న ఆ బాలుడు పాఠశాలకు వెళ్లేటప్పుడు తన తల్లి చున్నీని తీసుకుని వెళ్లాడు. ఆ చున్నీతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు... ఆత్మహత్య చేసుకున్న బాలుడిని చంద్రభాన్‌గా గుర్తించారు. అయితే చంద్రభాన్ స్కూల్‌కి బయలుదేరే ముందు తల్లి అతడికి టీ ఇచ్చి బిస్కెట్ ఇవ్వలేదని, అందువలన బిస్కెట్ కోసం 2 రూపాయలు ఇవ్వాల్సిందేనని మొండికేశాడు. చివరకు ఆమె చంద్రభాన్‌ను కొట్టడంతో ఆమె చున్నీ తీసుకుని స్కూలుకు బయలుదేరాడు. ఇక సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. 
 
గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో చంద్రభాన్ గ్రామస్తులకు కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments