Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేసి పారిపోతే పాస్‌పోర్టులు రద్దు : ఎన్నారై భర్తలకు వార్నింగ్

ప్రవాస భారతీయ భర్తలకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. భార్యలను వదిలివేసి దేశం విడిచి పారిపోతే పాస్‌పోర్టులను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇందులోభాగంగా తొలిగా 8 మంది ఎన్నారై భర్తల పాస్‌పోస్టులను రద్ద

Webdunia
శనివారం, 21 జులై 2018 (13:19 IST)
ప్రవాస భారతీయ భర్తలకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. భార్యలను వదిలివేసి దేశం విడిచి పారిపోతే పాస్‌పోర్టులను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇందులోభాగంగా తొలిగా 8 మంది ఎన్నారై భర్తల పాస్‌పోస్టులను రద్దు చేసింది. అలాగే, మరికొందరికి లుకౌట్ నోటీసులు జారీచేసింది.
 
ఇటీవలి కాలంలో భార్యలను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా భార్యలను మోసగించి పారిపోయే ఎన్నారైలపై ఓ కన్నేసి ఉంచడానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, హోంశాఖ, విదేశాంగ శాఖ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. గడిచిన 2 నెలల్లోనే ఈ కమిటీకి 70 ఫిర్యాదులందాయి. 
 
వాటిని పరిశీలించిన మీదట 8 మంది ఎన్నారైల పాస్‌పోర్టులు రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. కాగా, ఎన్నారైల వివాహాలను వెంటనే రిజిస్టర్‌ చేసే విధంగా అన్ని రాష్ట్రాలు రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రమంత్రి మేనక గాంధీ సూచించారు. ఎన్నారైలు ఏడురోజుల్లో తమ వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకోని పక్షంలో వారికి పాస్‌పోర్టులు, వీసాలు ఇచ్చేది లేదని ఆమె స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments