Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 నెలల పాపపై 28 ఏళ్ల కామాంధుడి అత్యాచారం.. పరిస్థితి విషమం

దేశంలో రోజూ అత్యాచారాలు ఏదో ఓ ప్రాంతంలో జరుగుతూనే వున్నాయి. ఇందులో ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో అయితే అత్యాచారాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మహిళలపై దురాగతాలు ఢిల్లీలో సర్వసాధారణంగా జరిగిపోతున్న

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (18:23 IST)
దేశంలో రోజూ అత్యాచారాలు ఏదో ఓ ప్రాంతంలో జరుగుతూనే వున్నాయి. ఇందులో ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో అయితే అత్యాచారాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మహిళలపై దురాగతాలు ఢిల్లీలో సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. 
 
పుట్టి ఎనిమిది నెలలే అయిన ఆడ శిశువుపై 28 ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎనిమిది నెలల చిన్నారిని.. ఆ శిశువు తల్లిదండ్రులు 28 ఏళ్ల ఓ వ్యక్తి పర్యవేక్షణలో వుంచి ఉద్యోగాలకు వెళ్లేవారు. అయితే చిన్నారిని వదిలిపెట్టి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లాక.. ఆ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి జననాంగంలో రక్రస్రావం కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
 
చిన్నారి నోటికి గుడ్డకట్టి ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడటంతో.. బాధితురాలైన పాప శ్వాస తీసుకోవడానికి శ్రమిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే చిన్నారికి శస్త్రచికిత్స చేశామని, అయినప్పటికీ చిన్నారి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments