Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో పెరిగిపోతున్న జికా వైరస్ కేసులో... ఒకే రోజు 8 నమోదు

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (09:39 IST)
మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన పూణెలో జికా వైరస్ ప్రబలుతుంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గురువారం ఒక్క రోజే ఏకంగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పూణెలో గత జూన్ నెలలో మొత్తం కేసుల సంఖ్య 66 నమోదు కాగా, గురువారం ఒక్కరోజే మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో ఆరుగురు గర్భిణీ మహిళలు ఉండటం గమనార్హం. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 74కు చేరింది. ఆ రాష్ట్ర వైద్య నివేదికల ప్రకారం పూణెలో జికా వైరస్ బారినపడి ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించాయి. 
 
అయితే, మృతుల అసలు కారణాలపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. జికా సోకిన వారిలో 26 మంది గర్భిణులు ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మిగిలిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన నలుగురు రోగులు 68 నుంచి 78 ఏళ్ల వయస్కులు. 
 
'66 కేసులలో (నిన్నటి వరకు నమోదైన కేసులు) నాలుగు మరణాలు ఉన్నాయి. అయితే ఈ మరణాలు జికా వల్ల కాకపోవచ్చు. ఈ రోగులు ఇతర సమస్యల వల్ల కూడా బాధపడుతున్నారు. వారు వృద్ధులు' అని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరణాలకు అసలు కారణంపై పూర్తి వివరాల కోసం పుణే మున్సిపల్ కార్పోరేషన్ ఆరోగ్య విభాగం నివేదికలను మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ ఆడిట్ కమిటీకి పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments