Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో పెరిగిపోతున్న జికా వైరస్ కేసులో... ఒకే రోజు 8 నమోదు

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (09:39 IST)
మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన పూణెలో జికా వైరస్ ప్రబలుతుంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గురువారం ఒక్క రోజే ఏకంగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పూణెలో గత జూన్ నెలలో మొత్తం కేసుల సంఖ్య 66 నమోదు కాగా, గురువారం ఒక్కరోజే మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో ఆరుగురు గర్భిణీ మహిళలు ఉండటం గమనార్హం. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 74కు చేరింది. ఆ రాష్ట్ర వైద్య నివేదికల ప్రకారం పూణెలో జికా వైరస్ బారినపడి ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించాయి. 
 
అయితే, మృతుల అసలు కారణాలపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. జికా సోకిన వారిలో 26 మంది గర్భిణులు ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మిగిలిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన నలుగురు రోగులు 68 నుంచి 78 ఏళ్ల వయస్కులు. 
 
'66 కేసులలో (నిన్నటి వరకు నమోదైన కేసులు) నాలుగు మరణాలు ఉన్నాయి. అయితే ఈ మరణాలు జికా వల్ల కాకపోవచ్చు. ఈ రోగులు ఇతర సమస్యల వల్ల కూడా బాధపడుతున్నారు. వారు వృద్ధులు' అని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరణాలకు అసలు కారణంపై పూర్తి వివరాల కోసం పుణే మున్సిపల్ కార్పోరేషన్ ఆరోగ్య విభాగం నివేదికలను మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ ఆడిట్ కమిటీకి పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments