Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. ఆఫీసులకు వచ్చేది లేదు.. వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాం.. ఉద్యోగులు

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (13:51 IST)
కరోనా నేపథ్యంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా ముగిసిన తర్వాత అందరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజా సర్వేలో ఓ షాకింగ్ న్యూస్ వెల్లడి అయ్యింది. 
 
అయితే కరోనా ప్రభావం తగ్గేవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాతే ఉద్యోగులు ఎలాంటి భయం లేకుండా ఆఫీసులకు వెళ్తారని అంటున్నారు. కరోనాకు అతి త్వరలో వ్యాక్సిన్లు రానున్న నేపథ్యంలో.. ప్రజలందరూ వ్యాక్సిన్లు తీసుకుంటే.. తిరిగి ఎప్పటిలా కార్యకలాపాలు కొనసాగుతాయని అంటున్నారు.
 
దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని భావిస్తున్నారని వెల్లడైంది. దేశంలోని 15 భిన్నమైన రంగాలకు చెందిన 550 కంపెనీల్లో పనిచేస్తున్న 1800 మంది ఉద్యోగులపై సర్వే చేశారు. దీంతో వారిలో 70 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని ఉందని చెప్పారు. 
 
కేవలం 30 శాతం మాత్రమే కార్యాలయాలకు వెళ్లాలని ఉందని వెల్లడించారు. అయితే ఆ 30 శాతం మంది కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారు కావడం విశేషం. వారిలో చాలామంది మేనేజర్ లెవల్‌లో పనిచేస్తున్నారు. అందువల్లే వారు కార్యాలయాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇక మిగిలిన వారందరూ సాధారణ ఉద్యోగులు. ఈ క్రమంలో వారు ఇంటి నుంచే పనిచేయాలని ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments