Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస : ఇద్దరు పోలీసులతో సహా ఏడుగురి మృతి

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (10:31 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఈ హింసలో ఇద్దరు పోలీసులతో పాటు ఒక గ్రామ వలంటీర్‌తో సహా ఏడుగురి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మణిపూర్ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లాలో చెలరేగిన హింసలో నలుగురు హత్యకు గురయ్యారు. వీరితో కలుపుకుని తాజాగా హింసలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మోరే గ్రామంలో సాయుధ మిలిటెంట్లు వీరిని కాల్చి చంపారు. మరో గ్రామంలో దుండగులతో జరిగిన ఎదురు కాల్పుల్లో విలేజ్ వలంటీర్ మృతి చెందారు. 
 
రిజర్వేషన్లు విషయంలో కుకీల, వెయిటీలకు మధ్య రేకెత్తిన అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 175మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. తాజాగా గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రతకు అద్దం పడుతుంది. తాజాగా ఘర్షణల నేపథ్యంలో ప్రజల భయంభయంగా గడుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments