Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను మింగేసిన కొండ చిలువ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (10:43 IST)
ఇండోనేషియాలో ఓ విషాదకరఘటన జరిగింది. 54 యేళ్ల మహిళను 24 అడుగులు పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. అటవీ ప్రాంతంలోని రబ్బరు ఏరేందుకు వెళ్లిన ఆ మహిళ అనూహ్యంగా కొండచిలువ చేతిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి ఓ 54 యేళ్ల మహిళ రబ్బరు ఏరేందుకు వెళ్లింది. ఆమె రెండు రోజులైన తిరిగి రాకపోవడంతో అనుమానించిన భర్త.. ఆమెను వెతుక్కుంటూ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆమె చెప్పులు. జాకెట్, హెడ్‌స్కార్ఫ్, కత్తి వంటివి కనిపించాయి. దీంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు అడవిని జల్లెడపట్టగా ఓ కొండ చిలువ కనిపించింది. దాని పొట్ట ఉబ్బెత్తుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఆ మహిళను కొండచిలువ మింగేసి ఉంటుందని భావించారు. ఆ తర్వాత గ్రామస్థులతో కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. అందులో మహిళ కళేభరాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments