Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో కరోనా కలకలం.. 50శాతం సిబ్బందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:52 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టురూమ్‌లతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
 
సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు సోమవారం కరోనా పాజిటివ్ అని తేలింది. సుప్రీంకోర్టు జడ్జీల కార్యాలయాలు, కోర్టు రిజిస్ట్రీల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా అని తాజాగా జరిపిన పరీక్షల్లో వెల్లడైంది. 
 
కరోనా కలకలంతో సుప్రీంకోర్టులో కేసులను జడ్జీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారిస్తున్నారు. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పలువురు కోర్టు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు ఆందోళన చెందుతున్నారు.
 
ఇండియాలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉంది. గత వారం రోజుల్లోనే కొత్తగా పది లక్షల కేసులు నమోదయ్యాయి. ఆదివారమే లక్షన్నరకు పైగా కేసులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments