Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 38 వేల కరోనా కొత్త కేసులు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (10:58 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13 శాతం తగ్గాయి. నిన్న 38,628 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోసారి మరణాల సంఖ్య పెరిగింది. నిన్న 617 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.27లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం 4,12,153 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీరేటు 97.37 శాతానికి చేరింది. తాజాగా 40వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు మూడు కోట్ల 10లక్షలకు చేరాయి.
 
50 కోట్ల డోసులు పంపిణీ..
కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దానికింద ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 49.5లక్షల మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments