Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ సింధు - ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన 311 మంది ఇండియన్స్

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (09:48 IST)
ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వైమానికదాడులు చేస్తున్నాయి. ఈ కారణంగా ఇరాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఇరాన్‌లో చిక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానిక తీసుకొస్తోంది. తాజాగా మరో 311 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరితో కలుపుకుని స్వదేశానికి వచ్చిన మొత్తం భారతీయుల సంఖ్య 1428కి చేరుకుంది. 
 
అమెరికా బాంబర్ విమానాలు ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై దాడులు ముమ్మరం చేశాయి. దీంతో మధ్యప్రాశ్యంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్లిష్టపరిస్థితుల నడుమ తాజాగా మరో 311 మంది భారతీయులు ఇరాన్‌లోని మష్హద్ నగరం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నారు. 
 
ఈ తరలింపు ప్రక్రియను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ సాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. జూన్ 22వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు మష్హద్ నుంచి ప్రత్యేక విమానంలో 311 మంది భారతీయ పౌరులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఇరాన్ నుంచి ఇప్పటివరకు 1428 మంది భారతీయులను సురక్షితంగా తరలించగలిగాం అని ఆయన తన ప్రకటలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments