Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం : భారీగా పెరగనున్న బంగారం ధరలు

Advertiesment
gold and silver

ఠాగూర్

, ఆదివారం, 22 జూన్ 2025 (23:07 IST)
పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ముఖ్యంగా, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల భయంతో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర అస్థిరత నెలకొంది. ఈ కారణంగా బంగారం ధర 3500 డాలర్ల నుంచి 700 ాడలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వెండిధర కూడా బంగారం బాటలోనే కాస్త నెమ్మదిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
రాబోయే వారాల్లో బంగారం ధర ఔన్సుకు 3500 డాలర్ల నుంచి 3700 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ కావొచ్చని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ చెందిన అక్షయ్ చించాల్కర్ మాట్లాడుతూ, స్పాట్ గోల్డ్ ధర 3314 డాలర్లపైన ఉన్నంత కాలం అది 3770 డాలర్ల దిశగా మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆప్షన్ మార్కెట్ కూడా బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తోందని చాలా మంది పెట్టుబడిదారులు ధరల పెరుగుదలపై పందెం కాస్తున్నారని ఇది తెలియజేస్తోందని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల