Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Silver: ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి వెండి ధరలు- లక్ష మార్కును తాకిన కిలో వెండి

Advertiesment
gold and silver

సెల్వి

, బుధవారం, 18 జూన్ 2025 (21:59 IST)
బంగారం తరహాలోనే వెండి ధరలకు కూడా రెక్కలొచ్చాయ్. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూలై గడువుకు సంబంధించిన వెండి ఫ్యూచర్స్ MCXలో కిలోగ్రాముకు రూ. 1,09,748 వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇది మంగళవారం రికార్డును బద్దలు కొట్టింది. 
 
సెప్టెంబర్ ఫ్యూచర్స్ మరింత పెరిగి కిలో గ్రాముకు రూ. 1,11,000ను తాకింది. ఈ లాభాలతో, వెండి ఇప్పుడు దాని ఆల్-టైమ్ కనిష్ట స్థాయి అయిన కిలోకు రూ. 88,050 కంటే దాదాపు 25 శాతం ట్రేడవుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్‌లో పునరుద్ధరణతో, మద్దతు ఇచ్చే ఫండమెంటల్స్ కారణంగా వెండి స్థిరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
అయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 0.2 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 99,329కి చేరుకున్నాయి. బంగారం తొలిసారిగా లక్ష రూపాయల మార్కును దాటిన కొన్ని రోజుల తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్