పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. మే 28న (బుధవారం) బంగారం లేదా వెండి ధరలు వున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.160 తగ్గిపోయి రూ.97,470కి చేరుకుంది.
10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.160 పడిపోయి రూ. 89,340కి చేరింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా స్వల్పంగా తగ్గాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గిపోయి రూ.99,900కు చేరుకుంది. మరోవైపు హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విజయవాడలో కూడా కేజీ వెండి రేటు 200 రూపాయలు పడిపోయి రూ.110,900కి చేరింది.