Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (08:58 IST)
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పలు ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో భారత్‌తో సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్‌తో సహా ఇతర ఇతర సహజవాయువుల కొరత ఏర్పడే అవకాశం ఉత్పన్నమైంది. ఈ కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల దేశంలో చమురు కొరత ఏర్పడుతుందనే భయాలు అక్కర్లేదన్నారు. 
 
గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నానం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వైవిధభరితం చేశాం. ప్రస్తుతం మనకు వచ్చే సరఫరాల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదు అని మంత్రి వివరించారు. 
 
కాగా, భారత్ తన ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి హానికరం. విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడుతుంది. అయినప్పటికీ రష్యా, అమెరికాల నుంచి దిగుమతులను పెంచుకోవడం ద్వారా భారత్ తన చమురు వనరులను వైవిధ్యభరితం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments