Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదిని చంపేసిన పోలీసులు.. వదినపై అకృత్యానికి పాల్పడ్డారు... ఎందుకు?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:11 IST)
లాకప్ డెత్‌ను కళ్లారా చూసిన ఓ మహిళపై రాజస్థాన్ పోలీసులు అకృత్యానికి పాల్పడ్డారు. మహిళను దారుణంగా హింసించిన పోలీసులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని చిరు జిల్లా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేమిచంద్ (22) అనే వ్యక్తి దొంగతనం చేసి అరెస్టయ్యాడు. ఈ నెల 6న అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు నిందితుడి వదినను కూడా అదుపులోకి తీసుకున్నారు.  
 
విచారణ పేరుతో నేమిచంద్‌ను తీవ్రంగా హింసించడంతో పాటు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు. నేమిచంద్ వదిన కళ్ల ముందే చనిపోవడంతో పోలీసుల దృష్టి ఆమెపై పడింది. ఆమె నేమిచంద్ లాకప్ డెత్‌ను బయటికి చెప్పేస్తుందనే భయంతో.. ఆమెను తీవ్రంగా హింసించారు. ఆమె గోళ్లు పీకేశారు. 
 
కను రెప్పలు కూడా తెరవలేనంత తీవ్రంగా కొట్టారు. నిస్సహాయురాలిగా పడివున్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments