Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంటీతో అక్రమ సంబంధం... రసపట్టులో ఉండగా ఇంటికొచ్చిన మామ.. ఆ తరువాత?

Advertiesment
Teen boy
, శుక్రవారం, 12 జులై 2019 (19:02 IST)
వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. కొన్నేళ్లుగా అర్థరాత్రి పెళ్లయిన తన ప్రియురాలిని కలుస్తూ వచ్చిన ఆ యువకుడు... ఈ క్రమంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు. ముంబైలో అగ్రిపద ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు కొద్దినెలలుగా ముంబైలోని తన మేనమామతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. 
 
అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం యువకుడి మేనమామకు తెలియడంతో... అప్పటి నుంచి కొద్దిరోజుల పాటు తన ప్రియురాలికి దూరంగా ఉంటూ వచ్చాడు.
 
అయితే మళ్లీ ఎప్పటిలాగే ఆమెను కలవడం మొదలుపెట్టిన అతడు... అర్థరాత్రి సమయంలో దొడ్డిదారిన ఆమె ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లోకి కిటికీల ద్వారా చేరుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఉన్నట్టుండి మహిళ భర్త రావడంతో ఏం చేయాలో అర్థంకాక తాను పట్టుకున్న కిటికీని వదిలేశాడు యువకుడు. వర్షాల కారణంగా కిటికీ గోడలు తడిచి ఉండటంతో ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడి చనిపోయాడు. 
 
మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... స్థానికులు, అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు వివాహితను కలిసే క్రమంలోనే అతడు చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో.. అక్కడ కరెన్సీ వర్షం కురిసింది.. వీడియో వైరల్