Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీతో వచ్చిన కష్టం.. శానిటైజర్‌లో నీళ్లు కలుపుకొని తాగిన ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (13:56 IST)
మందు బాబులకు మరోసారి కరోనా కష్టాలు తప్పేలా లేవు. కరోనా విజృంభిస్తోన్న వేళ.. మందు షాపులు మూతపడిన రోజులున్నాయి. మళ్లీ ఆ రోజులు తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో.. హోలీ పండుగ రోజున మద్యం షాపులు మూసేయడంతో.. ఓ ముగ్గురు వ్యక్తులు శానిటైజర్‌లో నీళ్లు కలుపుకొని తాగారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన మద్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలో చోటు చేసుకుంది. 
 
హోలీ పండుగ రోజున రింకూ లోధి అనే వ్యక్తి.. మద్యం సేవించాలనుకున్నాడు. కానీ హోలీ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయించింది. దీంతో లోధి రెండు శానిటైజర్ బాటిళ్లను తీసుకొని తన బంధువులైన సంజు, అమిత్ వద్దకు వెళ్లాడు. ముగ్గురు కలిసి శానిటైజర్‌లో వాటర్ కలుపుకొని సేవించారు. అదే రోజు రాత్రి లోధి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 
 
అతన్ని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అమిత్ గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, సంజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments