Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 రోజుల విరామం తర్వాత రాహుల్ భారత్ జోడో యాత్ర

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (09:48 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారతో జోడో యాత్ర తొమ్మిది రోజుల విరామం తర్వాత మళ్లీ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నారు. గత యేడాది సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యత్ర ఇప్పటివరకు 110 రోజుల్లో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 
 
తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్ర మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్రం అంతిమంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ముగుస్తుంది. ఒక రాజకీయ నేత ఇన్ని వేల కిలోమీటర్లు, ఇంత సుధీర్ఘంగా యాత్ర చేపట్టడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 
 
కాగా, ఈ నెల 26వ తేదీన శ్రీనగర్‌లో ఈ యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత "హాథ్ సే హాథ్ జోడో" (చేయి చేయి కలుపు) అంటూ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనుంది. ఈ యాత్రకు సంబంధించిన సందేశాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. "హాథ్ సే హాథ్ జోడో" ప్రచార బాధ్యతలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టనున్నారు. దేశంలోని మహిళలో లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రియాంకా గాంధీ ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments