Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా-పాకిస్థాన్ ఒకటైనాయి.. యుద్ధం వస్తే దాడి ఖాయం.. రాహుల్ గాంధీ

rahul gandhi
, సోమవారం, 26 డిశెంబరు 2022 (14:58 IST)
అరుణాచల్ ప్రదేశ్‌లోని దవాంగ్ సెక్టార్‌లో ఇటీవల ఆక్రమణలకు పాల్పడిన చైనా సైనికులను భారత సైనికులు తరిమికొట్టారు. ఈ వివాదం కారణంగా ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజింగ్‌లో జరిగిన ఒక సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను నిర్ధారించడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సందర్భంలో, ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారతదేశానికి వ్యతిరేకంగా చైనా-పాకిస్తాన్‌లు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. యుద్ధం వస్తే కలిసి భారత్‌పై దాడి చేయవచ్చునని కూడా తెలిపారు. సరిహద్దులో ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పాలని, మనం ఏ చర్య తీసుకున్నా ఇప్పుడే ప్రారంభించాలని, నిజానికి ఐదేళ్ల క్రితమే చర్యలు తీసుకోవాల్సి ఉందని రాహుల్ అన్నారు. త్వరగా చర్యలు తీసుకోకుంటే దేశానికి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరిలో ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం - సభ్యత్వం కోసం ఓ మిస్డ్ కాల్...