Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కరోనా విలయతాండవం.. ధారావిని తలపిస్తోన్న కన్నగినగర్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:27 IST)
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో ఇప్పటి వరకు 8,002 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,051 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేవలం చెన్నైలోనే 4,371 కేసులు నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌.. తాజాగా స్లమ్‌ ఏరియా అయిన కన్నగి నగర్‌కు వ్యాపించింది. కన్నగి నగర్‌ ప్రస్తుతం మరో ధారవిని తలపిస్తోంది. 
 
ఈ ప్రాంతంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కన్నగి నగర్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 30 వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఒకే రోజు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అధికారులు కూడా అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కోయంబేడు మార్కెట్‌ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్‌లో 527 మందికి కరోనా సోకింది. దీంతో కోయంబేడు మార్కెట్‌ను పోలీసులు మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments