చెన్నైలో కరోనా విలయతాండవం.. ధారావిని తలపిస్తోన్న కన్నగినగర్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:27 IST)
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో ఇప్పటి వరకు 8,002 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,051 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేవలం చెన్నైలోనే 4,371 కేసులు నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌.. తాజాగా స్లమ్‌ ఏరియా అయిన కన్నగి నగర్‌కు వ్యాపించింది. కన్నగి నగర్‌ ప్రస్తుతం మరో ధారవిని తలపిస్తోంది. 
 
ఈ ప్రాంతంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కన్నగి నగర్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 30 వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఒకే రోజు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అధికారులు కూడా అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కోయంబేడు మార్కెట్‌ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్‌లో 527 మందికి కరోనా సోకింది. దీంతో కోయంబేడు మార్కెట్‌ను పోలీసులు మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments