Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:52 IST)
65 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా వున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో నిందితుడికి స్పెషల్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని పాలికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక 2020 ఆగస్ట్‌ 20న తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పొలంలోకి వెళ్లింది. వాళ్లిద్దరూ బాలికను చెట్టు కింద కూర్చోపెట్టి పని చేసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో 65 ఏళ్ల వ్యక్తి బాలికను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తాతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును స్పెషల్ కోర్టు రెండేళ్ల పాటు విచారించి తాజాగా తుది తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments