Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాబోయే భర్తకు చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది.. ఎందుకో?

woman
, మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:39 IST)
కాబోయే భర్తను చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది ఓ యువతి. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేకనే ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పుష్ప తెలిపింది. పెళ్లి ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని.. అందుకే ఇలా చేశానని ఒప్పుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మాడుగుల మండలం పాడేరుకు చెందిన రామానాయుడు.. హైదరాబాద్‎లోని సీఎస్ఐఆర్‎లో సైంటిస్ట్‎గా పనిచేస్తున్నాడు. 
 
ఆయనకు చోడవరం నియోజవర్గంలోని రావికమతం గ్రామానికి చెందిన పుష్పతో పెళ్లి కుదిరింది. వీరిద్దరికి వచ్చే నెల 29న వివాహం జరగాల్సి ఉంది. కానీ కాబోయే భర్తకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అంటూ కొండపైకి తీసుకెళ్లి.. కళ్లకు గంతలు కట్టి గొంతు కోసింది. 
 
స్థానికుల సాయంతో ఆస్పత్రికి చేరుకున్న యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పుష్పను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో రామానాయుడుతో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనమిద్దరం - మనకిద్దరు నినాదాన్ని వీడాలి : సాధ్వి రితంబర