Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్.. రుతుస్రావం వయస్సులో వున్న ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (10:46 IST)
అవును. అయ్యప్ప స్వామిని మహిళలు దర్శించుకున్నారు. ఆలయం అపవిత్రమైపోయిందని భక్తులు వాపోతున్నారు. సుప్రసిద్ధ క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని అన్నీ వయో వర్గాలకు చెందిన మహిళలు దర్శించుకోవచ్చునని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. భక్తులు మహిళా ప్రవేశానికి అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కేరళ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది. 
 
అయ్యప్ప దేవాలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు ఈ తెల్లవారుజామున స్వామిని దర్శించుకున్నారు. మండల పూజలు ముగిసి మకరవిళక్కు పూజల కోసం ఆలయాన్ని తెరిచి వుంచారు.

మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. వారు ఆలయానికి సమీపంలోకి వచ్చిన తరువాత, భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారు. 
 
ఇంకా బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలకు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం లభించింది. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments