Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్.. రుతుస్రావం వయస్సులో వున్న ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (10:46 IST)
అవును. అయ్యప్ప స్వామిని మహిళలు దర్శించుకున్నారు. ఆలయం అపవిత్రమైపోయిందని భక్తులు వాపోతున్నారు. సుప్రసిద్ధ క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని అన్నీ వయో వర్గాలకు చెందిన మహిళలు దర్శించుకోవచ్చునని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. భక్తులు మహిళా ప్రవేశానికి అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కేరళ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది. 
 
అయ్యప్ప దేవాలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు ఈ తెల్లవారుజామున స్వామిని దర్శించుకున్నారు. మండల పూజలు ముగిసి మకరవిళక్కు పూజల కోసం ఆలయాన్ని తెరిచి వుంచారు.

మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. వారు ఆలయానికి సమీపంలోకి వచ్చిన తరువాత, భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారు. 
 
ఇంకా బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలకు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం లభించింది. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments