Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్.. రుతుస్రావం వయస్సులో వున్న ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (10:46 IST)
అవును. అయ్యప్ప స్వామిని మహిళలు దర్శించుకున్నారు. ఆలయం అపవిత్రమైపోయిందని భక్తులు వాపోతున్నారు. సుప్రసిద్ధ క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని అన్నీ వయో వర్గాలకు చెందిన మహిళలు దర్శించుకోవచ్చునని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. భక్తులు మహిళా ప్రవేశానికి అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కేరళ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది. 
 
అయ్యప్ప దేవాలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు ఈ తెల్లవారుజామున స్వామిని దర్శించుకున్నారు. మండల పూజలు ముగిసి మకరవిళక్కు పూజల కోసం ఆలయాన్ని తెరిచి వుంచారు.

మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. వారు ఆలయానికి సమీపంలోకి వచ్చిన తరువాత, భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారు. 
 
ఇంకా బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలకు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం లభించింది. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments