ఉత్తర సిక్కింలో ఘోరం.. లోయలో పడిన ఆర్మీ ట్రక్కు - 16 మంది మృతి

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:18 IST)
ఇండోచైనా సరిహద్దు ప్రాంతమైన ఉత్తర సిక్కింలో శుక్రవారం ఘోరం జరిగింది. భారత ఆర్మీకి చెందిన ట్రక్కు వాహనం ఒకటి చాలా లోతైన లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు ప్రాణాలతో చనిపోయారు. మరో నలుగురు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు 130 కిలోమీటర్ల దూరంలో, లాచెన్‌కు 15 కిలోమీటర్లలో ఉన్న జెమా 3 వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు జరిగింది. 
 
దీనిపై ఇండియన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు స్పందిస్తూ, ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆర్మీ జవాన్లు సేవలు వారి నిబద్ధతకు దేశం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతుంది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments