Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర సిక్కింలో ఘోరం.. లోయలో పడిన ఆర్మీ ట్రక్కు - 16 మంది మృతి

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:18 IST)
ఇండోచైనా సరిహద్దు ప్రాంతమైన ఉత్తర సిక్కింలో శుక్రవారం ఘోరం జరిగింది. భారత ఆర్మీకి చెందిన ట్రక్కు వాహనం ఒకటి చాలా లోతైన లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు ప్రాణాలతో చనిపోయారు. మరో నలుగురు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు 130 కిలోమీటర్ల దూరంలో, లాచెన్‌కు 15 కిలోమీటర్లలో ఉన్న జెమా 3 వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు జరిగింది. 
 
దీనిపై ఇండియన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు స్పందిస్తూ, ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆర్మీ జవాన్లు సేవలు వారి నిబద్ధతకు దేశం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతుంది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments