Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరాఖండ్‌లో ఘోరం.. పెళ్లి బృందం బస్సు బోల్తా - 25 మంది మృతి

road accident
, బుధవారం, 5 అక్టోబరు 2022 (09:16 IST)
దేవభూమి ఉత్తరాఖండ్‌లో దసరా మహోత్సవం రోజున ఘోరం జరిగింది. పెళ్లి బృందంతో పెళుతున్న బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మృత్యువాపడ్డారు. హరిద్వార్ నుంచి పౌరీ జిల్లాలోని బీర్ఖల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ బస్సు అదుపుతప్పి రోడ్డు బ్యారియర్లను దాటుకుని చెట్టును ఢీకొట్టి లోయలోపడింది. రాత్రిపూట ఈ ప్రమాదం జరగడంతో చీకట్లో సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ ప్రమాదం వార్త తెలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
ప్రమాదానికి గురైన బస్సు హరిద్వార్ జిల్లా నుంచి పౌరి జిల్లాలోని బీర్ఖల్ బ్లాకుకు వెళుతుండగా, రిఖ్నింఖల్ బిరోంఖల్ మోటార్ రోడ్డు సమీపంలో సిమ్ది గ్రామంలో బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతైన నాయర్ నది లోయలోకి దూసుకెళ్ళింది. ప్రమాద స్థలంలోనే 25 మంది భావిస్తున్నారు. అయితే, ప్రమాద స్థలంలో ఉన్న అధికారులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడంలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
కాగా, గత యేడాది జూన్ నెలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో బస్సు ఒకటి 250 మీటర్ల లోతులోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన 25 మంది ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రిధామ్ నుంచి యాత్రికులను తీసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుద్ధంలో పాల్గొనాలంటూ నోటీసు.. తన వల్ల కాదంటూ ఆత్మహత్య.. ఎక్కడ?