Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌని అమావాస్య- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. 15మంది మృతి

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (09:12 IST)
Stampede
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది భక్తులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి వేలాది మంది యాత్రికులు సంగం వద్ద గుమిగూడిన సమయంలో ఈ సంఘటన జరిగింది. జనరద్దీ విపరీతంగా ఉండటంతో బారికేడ్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
బాధితుల్లో అనేక మంది మహిళలు ఉన్నారు. అత్యవసర సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. సంఘటన జరిగిన కొద్దిసేపటికే దాదాపు 70 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు రోజు మాత్రమే, గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద దాదాపు 55 మిలియన్ల మంది యాత్రికులు స్నానమాచరించారు.
 
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి వివరాలు కోరారు. ఈ విషాదం నేపథ్యంలో, మౌని అమావాస్య అమృత స్నానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. అఖిల భారతీయ అఖార పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ, సంగమం వద్ద భారీ సంఖ్యలో జనసమూహం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments