Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 ఏళ్ల అమ్మాయిపై దారుణం.. తొమ్మిది మంది.. మూడేసి సార్లు.. ట్రక్కు మార్చి..?

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (14:13 IST)
13 ఏళ్ల అమ్మాయిపై దారుణం జరిగింది. తొమ్మిది మంది మృగాలు.. మూడేసి సార్లు ట్రక్కు మార్చి ట్రక్కులోకి ఎక్కించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. రోడ్డు మీద వదిలేసి పరారయ్యారు. రోడ్డు మీద కనపడిన వాళ్లను సాయమడిగినా ఎవరూ స్పందించలేదు. 
 
సాయం చేసినట్టే చేసిన ఓ ట్రక్కు డ్రైవర్.. తానూ మృగాన్నేనని నిరూపించాడు. అతడూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను వదిలేసి పరారయ్యాడు. మొత్తంగా 9 మంది ఓ బాలిక జీవితంతో పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమేరియాలో ఈనెల 11-12 తేదీల మధ్య జరిగింది. ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
 
వివరాల ప్రకారం.. ఉమేరియాలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. ఈ నెల 11న షాపునకు వెళ్లింది. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఒంటరిగా వెళుతున్న బాలికను కిడ్నాప్ చేశారు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ట్రక్కులోనే బందీగా ఉంచి ఓ దాబాకు తీసుకెళ్లారు. 
 
అక్కడ మరో ఐదుగురు ఆ ఇద్దరితో కలిసి దారుణానికి పాల్పడ్డారు. దాబా యజమాని కూడా కనికరం చూపలేదు. తర్వాత ట్రక్కులోకి ఎక్కించి ఆ రోజు రాత్రంతా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మానసికంగా చాలా కుంగిపోయిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం