Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 యేళ్లు.. మోడీ ఏమన్నారంటే...

అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి సోమవారంతో 125 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:35 IST)
అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి సోమవారంతో 125 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. 
 
ఆయన మాట్లాడుతూ... ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడటానికి మన అసమర్థతే కారణమన్నారు. 1983లో వివేకానందుడు చికాగోలో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారని గుర్తు చేసిన ఆయన, 'యంగ్ ఇండియా - న్యూ ఇండియా' నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 
 
స్వామి వివేకానంద ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొంది కలలను సాకారం చేసుకునే దిశగా యువత ముందడుగు వేయాలని ఆయన కోరారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే 2001, సెప్టెంబర్ 11వ తేదీన ముంబైపై ముష్కరులు దాడికి తెగబడ్డారని విమర్శించారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉంటే వందలాది ప్రాణాలు మిగిలేవని అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, స్వామి వివేకానంద చికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వామి వివేకానందకు ఘనంగా నివాళులర్పించారు. 1893లో చికాగోలో స్వామివివేకానంద చారిత్రక ప్రసంగానికి 125 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా నివాళులర్పిస్తున్నానని మమత ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments