Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 యేళ్లు.. మోడీ ఏమన్నారంటే...

అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి సోమవారంతో 125 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:35 IST)
అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి సోమవారంతో 125 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. 
 
ఆయన మాట్లాడుతూ... ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడటానికి మన అసమర్థతే కారణమన్నారు. 1983లో వివేకానందుడు చికాగోలో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారని గుర్తు చేసిన ఆయన, 'యంగ్ ఇండియా - న్యూ ఇండియా' నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 
 
స్వామి వివేకానంద ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొంది కలలను సాకారం చేసుకునే దిశగా యువత ముందడుగు వేయాలని ఆయన కోరారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే 2001, సెప్టెంబర్ 11వ తేదీన ముంబైపై ముష్కరులు దాడికి తెగబడ్డారని విమర్శించారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉంటే వందలాది ప్రాణాలు మిగిలేవని అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, స్వామి వివేకానంద చికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వామి వివేకానందకు ఘనంగా నివాళులర్పించారు. 1893లో చికాగోలో స్వామివివేకానంద చారిత్రక ప్రసంగానికి 125 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా నివాళులర్పిస్తున్నానని మమత ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments