Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసులు - ఏపీలో కూడా..

Webdunia
బుధవారం, 26 మే 2021 (16:32 IST)
దేశంలో ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. మరోవైపు, దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 11,717 కేసులు నమోదయ్యాయి. 
 
కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్‍ను మహమ్మారిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. 
 
ఇదే అంశంపై గత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మన దేశానికి సరికొత్త సవాల్‌గా బ్లాక్ ఫంగస్ అవతరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. నొప్పులు, కళ్లు, ముక్కు చూట్టూ ఎర్రబడటం, జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా చెబుతున్నారు. 
 
ఇదిలావుండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఏకంగా 50కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments