Webdunia - Bharat's app for daily news and videos

Install App

11మంది యువకులు ఏడాదిగా యువతిపై అత్యాచారం, బిడ్డకు జన్మ.. ఆ తరువాత?

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (19:57 IST)
నిర్భయ చట్టాలు వచ్చినాసరే కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కొంతమందిని బలవంతంగా లొంగదీసుకుంటే మరికొంతమందికి మాయమాటలు చెప్పి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
 
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలోని వాసాయ్ గ్రామంలో 21 యేళ్ళ యువతిని మాయమాటలు చెప్పి ప్రేమించాడు ఒక యువకుడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకుని ఇంటి నుంచి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. నెల రోజుల పాటు ఇద్దరూ వేరే ప్రాంతంలో ఒకే గదిలో కలిసి ఉన్నారు. యువతి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారు కుమార్తెను వారం రోజుల పాటు వెతికి ఆ తరువాత పట్టించుకోలేదు. అయితే యువకుడు మాత్రం వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి పలుమార్లు యువతితో శారీరకంగా కలిశాడు. ఆ తరువాత ఆ యువతిని వదిలించుకోవాలనుకున్నాడు. 
 
తన స్నేహితులకు విషయం చెప్పి ఒక స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళాడు. అతని స్నేహితుడు కూడా ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఇలా అతని స్నేహితులు, వారి స్నేహితులు కలిసి మొత్తం 11 మంది యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సంవత్సరన్నగా ఈ అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అయితే ఆ యువతి గర్భం ధరించింది. అయినాసరే కామాంధులు ఆమెను వదిలిపెట్టలేదు. దీంతో భయాందోళనకు గురైన యువతి వారి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments