Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. చిన్నారులతో సహా 11 మంది మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (11:10 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక క్రీడా వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.యూ.వీ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా బంధువులు ఇంటిలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదంబారినపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ధామ్‌తరి జిల్లా సోరా - భట్‌గావ్ గ్రామానికి చెందిన కంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలోని తమ బంధువుల ఇంట జరిగే వివాహానికి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జాతీయ రహదారి 30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగార్తా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్రమాదంలో మహీంద్రా బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. పురూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments