Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ... 11 మంది సజీవదహనం

ఠాగూర్
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (11:34 IST)
ఢిల్లీ పెయింట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ఆహుతయ్యారు. పక్కనే గోడౌన్లకు వ్యాపించిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయలయ్యాయి. వీరిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఢిల్లీ నగర శివారు ప్రాంతంలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం మంటలు ఎసిగిపడ్డాయి. కాస్త వ్యవధిలో చుట్టుపక్కల ఉన్న గోడౌన్లకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి. మొత్తం 22 ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. గురువారం రాత్రి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించగా, శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. 
 
దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11 మందికి చేరింది. మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఆలిపూర్‌లోని దయాల్ పూర్ మార్కెట్‌ ఏరియాలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయని, విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments