Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్‌: రెండు విమానాలు ఢీ.. ఐదుగురు గల్లంతు..

iaf plane
, మంగళవారం, 2 జనవరి 2024 (16:59 IST)
జపాన్‌లోని టోక్యో హనెడా విమానాశ్రయం రన్‌వేపై మంగళవారం రెండు విమానాలు ఢీకొనడంతో ఒక విమానంలో భారీ మంటలు చెలరేగాయి. విమానంలో 379 మంది ప్రయాణికులు ఉన్నారు.  విమానం ల్యాండింగ్ తర్వాత మరొక విమానాన్ని ఢీకొనడంతో అగ్ని ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఢీకొనడంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. 
 
కూలిపోయిన జపాన్ కోస్ట్ గార్డ్ విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఐదు మంది జాడ తెలియలేదు. మంటలు చెలరేగిన విమానం సంఖ్య JAL 516, ఈ విమానం హక్కైడో నుండి బయలుదేరింది. ఎన్‌హెచ్‌కెలోని లైవ్ ఫుటేజీలో విమానం కిటికీల నుంచి మంటలు రావడం కనిపించింది. మొత్తం 379 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అయితే ఐదుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. 
 
టోక్యో నుండి ఒసాకాకు ఎగురుతున్న JAL జంబో జెట్ సెంట్రల్ గున్మా ప్రాంతంలో 1985లో కుప్పకూలినప్పుడు దేశంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది. అప్పుడు, 520 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరు పబ్‌‌లో డ్యాన్సులు చేసిన మంత్రి రోజా.. ట్రోల్స్ మొదలు