Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్ భూకంపం: 155 కంపించిన భూకంపం.. 24 మంది మృతి

earthquake
, మంగళవారం, 2 జనవరి 2024 (13:43 IST)
జపాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఒక్క రోజులో భూమి 155 సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసమై పలు ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. 
 
శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫుమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఆర్మీ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు. ప్రాణనష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు. 
 
కాగా, భూకంప తీవ్రతకు మెట్రో స్టేషన్ కంపించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అంతే కాకుండా భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రేటర్ నోయిడాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..